తెలుగు సినిమాలు గత కొన్నేళ్లుగా ఒక విచిత్రమైన దశలో ప్రయాణిస్తున్నాయి. తమ మాస్ కలర్ను కోల్పోకుండా, కంటెంట్ కల్చర్ను చేరుకోవాలనే ద్విపాత్రాభినయం చేస్తున్నాయి. భైరవం కూడా అలాంటి ప్రయత్నమే. ముగ్గురు హీరోలు, ఓ ఆలయమూ, ట్రస్టీ, ఆస్తి, దేవత చుట్టూ తిరిగే కథ — వినటానికి రూటెడ్ గా, చూడటానికి రిచ్ గానే ఉంది. కానీ అసలు ప్రశ్న: మనసులోకి వెళ్తుందా?లేదా రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
తూర్పు గోదావరిలోని దేవిపురం. అక్కడ ఉన్న వారాహి అమ్మవారి ఆలయం. ఆ గుడికి వేల కోట్ల విలువైన ట్రస్ట్ భూములు. వాటిని గద్దలా తన్నుకుపోవాలని ఓ మంత్రి దురాశ. అయితే ఆ గుడిని కాపాడుతున్న ముగ్గురు నమ్మకస్తులు. వాళ్లను దాటాలి.
గజపతివర్మ – ఆ ఊళ్లో యువరాజులాంటి పెద్ద మనిషి
వరద (నారా రోహిత్) – అంతర్నిశ్శబ్దంలో ఉన్న అగ్ని,
శ్రీను (బెల్లంకొండ ) – వీరిద్దరికీ మధ్య నడిచే హృదయం.
ముందుగా గుడికి శత్రువులు వస్తారు.
తర్వాతే వస్తుంది — స్నేహానికి శత్రువు!
ఆ ముగ్గురి మధ్య ఉనన్న పాతికేళ్ల బంధాన్ని దెబ్బ కొట్టి, ఆ గుడి మాన్యం లేపేద్దామని మంత్రి వెదురుమల్లి (శరత్ లోహితాశ్వ) వేసే వ్యూహం.
గుడి ఆస్తిని రక్షించాలంటే ముందు ఈ ముగ్గురు ఒకరినొకరు నమ్మాలి.
కానీ అది సాధ్యం అవుతుందా?
ఇది కేవలం భూవివాదం కాదు…
ఇది నమ్మకాన్ని పునర్నిర్మించాల్సిన యుద్ధం!
చివరకు ఏమైంది..ఆ ఆస్ది భూములు మేటర్ ఏమైంది, ఈ స్నేహితులు విడిపోతారా, కలిసి ఉంటారా,
శ్రీను ఆ గుడి ఆస్దిని మంత్రి నుంచి రక్షించగలుగుతాడా అనేది తెర మీద చూడాల్సిన కథ.
ఎలా ఉంది.
“A story is only as strong as its soul.”
భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల నుంచి వచ్చిన ఈ మాస్ డ్రామా…ముగ్గురు హీరోల ఎంట్రీలతో స్టార్ట్ అయినా.. వాళ్ళను గుర్తుంచుకునే ఎమోషనల్ బేస్ మాత్రం కనిపించదు. స్క్రీన్ప్లే పరంగా ఇది ఒక missed opportunity అనే చెప్పాలి. మొదటి 40 నిమిషాల పాటు పాత్రలు కేవలం పాటలు, ఫైట్లు మాత్రమే స్క్రీన్ మీద ఉంటాయి.
వరద పాత్ర (నారా రోహిత్) లో సీరియెస్ నెస్ ఉంది కానీ ఆర్క్ లో డ్రామా డెప్త్ లేదు. గజపతి పాత్ర (మంచు మనోజ్) మాత్రం ఎనర్జిటిక్ కానీ లౌడ్. బెల్లంకొండ పాత్రలో డివైన్ యాంగిల్ ఉన్నా, ఆ ఫీల్ మనకు అనుభవం అవ్వదు, ఎందుకంటే ప్రిపరేషన్ లేకుండా పరిష్కారం రావడం చూసినట్టుగా ఉంటుంది. ఇలా స్క్రీన్ప్లే మొత్తం “ముగ్గురికి సమానంగా ఎలివేషన్ ఇవ్వాలి” అనే నిబద్ధతతో సాగుతుంది, కానీ ఆడియన్ కు ఎమోషన్ డెలివర్ చేయడంలో తడబడుతుంది.
భైరవం కథ ప్రారంభంలోనే మూడు ప్రధాన పాత్రల మాస్ ఎంట్రీలతో హడావుడిగా మొదలవుతుంది. స్క్రీన్ప్లే పరంగా చూస్తే, Act One గమ్యం ఏమిటో చెప్పకుండానే, పాత్రల ఎలివేషన్స్ & సౌండ్ తో నిండి ఉంటుంది. కథా “set-up” లోనే పాత్రల మోటివేషన్లు క్లియర్ అవ్వవు. శీను పాత్ర (బెల్లంకొండ) హీరో నే కానీ చేయడానికి ఏమీలేదు. అతని ఆర్క్ మొదటి 45 నిమిషాల్లో అలా స్దిరంగా ఉంటుంది. అటూ ఇటూ జరగదు.
ఇక వరద (నారా రోహిత్) పాత్ర మంచితనం & రివేంజ్ మధ్య ఊగుతూ ఆసక్తికరంగా ఉంటుంది, కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఇక గజపతి (మంచు మనోజ్) – వాయిస్ లౌడ్, విషయం తక్కువ..విశ్లేషణ ఎక్కువ అన్నట్లు సాగుతుంది.
తమిళ ఒరిజినల్ ‘గరుడన్’లో ఉన్న ఆ ఎమోషన్ ని, divine presenceని… ఈ రీమేక్ అట్టడుగు నుండి రీప్లికేట్ చేయలేకపోయింది. భైరవంలో స్క్రీన్ కనిపిస్తుంది. కానీ ఆ మాయ మాత్రం లేకుండా పోయింది.
ఫైనల్ గా..
డైరెక్టర్ విజయ్ కనకమేడల కథా ambitious గా ప్రారంభిస్తాడు. కానీ భూముల కోసం జరుగుతున్న రాజకీయ కుట్ర, దాని వెనుక ఉన్న మానవ సంబంధాల వైషమ్యం చూపించే ప్రయత్నం చేసాడు. కానీ ఈ గొప్ప కాన్సెప్ట్కి సరిపడే అంతర్లీన భావోద్వేగాలను స్క్రీన్పైన రీప్రొడ్యూస్ చేయడంలో screenplay సహకరించలేదు.
చివర్లో వచ్చే కాంతారా శైలిలో divine touch climactic లో వాడినప్పటికీ, దానికి తగిన గ్రౌండ్ వర్క్ లేకపోవడం వల్ల అది కేవలం “effect” గానే మిగిలిపోయింది, “emotion” గా మారలేకపోయింది.